నిజంనిప్పులాంటిది

May 22 2023, 18:45

టికెట్లను ప్రకటించేస్తున్న కేటీఆర్ వీరికి మాత్రం టెన్షనే

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) దూకుడు పెంచింది. తరచుగా పర్యటనలు చేపడుతూ, పార్టీకి ఆదరణ పెంచేందుకు కింది స్థాయి నేతల్లో ఉత్చాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారు తరచుగా జిల్లాలు పర్యటనలు చేపడుతూ, కీలకమైన ఎన్నికల హామీలను ఇస్తూ , ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మంత్రి కేటీఆర్( Minister KTR ) జిల్లాల పర్యటనలో అనేక కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ వారిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారు.

బిజెపి, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చకు పెడుతున్నారు . వివాదాలు లేని నియోజకవర్గాల్లో ని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ జిల్లా పర్యటనలు ఎక్కువగా చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పర్యటనలో పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి అని , బండి సంజయ్ ను ఇంటికి పంపి వినోద్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

వరంగల్ లో వినయ్ భాస్కర్, కామారెడ్డి జిల్లా జక్కల్ లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే విషయంలోనూ కేటీఆర్ ఇదే విధంగా ప్రకటనలు చేశారు. కేటీఆర్ జిల్లా పర్యటనల్లో ఈ విధంగా కొన్ని కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పార్టీలో చర్చనీయాంశం గా మారింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేటీఆర్ మౌనంగా ఉండడంతో , అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది.

రామగుండం ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడిన కేటీఆర్ చందర్ మంచి యువకుడు అని ,బాగా కష్టపడతాడని , ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాడని, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు . కానీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పకపోవడంతో, ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది. ఇక పెద్దపల్లి ఎంపీ బార్లకుంట వెంకటేష్ పేరును కూడా కేటీఆర్ ప్రస్తావించలేదు దీనిపైన చర్చ జరుగుతోంది. అవినీతి వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలతో వివాదాల్లో ఉంటున్న వారి విషయంలో సైలెంట్ గా ఉండడంతో వారికి టిక్కెట్ దక్కదు అనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం కేటీఆర్ జిల్లా టూర్లపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.

నిజంనిప్పులాంటిది

May 22 2023, 18:39

షర్మిలకు ప్రియాంక గాంధీ ఫోన్

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో స్థానికంగా కొన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం చూపించగలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

దీనిలో భాగంగానే తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీతోను పొత్తు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధమవుతోంది.

ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ,అయితే వాటికి తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు.

ఇప్పుడు స్వయంగా ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో సంప్రదింపులు చేయడం, దీనికి డీకే శివకుమార్ మధ్యవర్తత్వం వహించడంతో పొత్తు పెట్టుకునే దిశగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.

డీకే శివకుమార్ త్ షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ఆయన ద్వారానే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్ తో కలిసి నడిచే విధంగా చేసేందుకు కాంగ్రెస్ .ప్రయత్నాలు చేస్తూ ఉండడం, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఏపీ తెలంగాణలో ఆ వర్గం ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుందనే అంచనాలతోనే షర్మిల తో ప్రియాంక మంతనాలు చేస్తున్నారట.

షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా , కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరుతుందని, తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగబోతుండడంతో, అక్కడ ప్రభావం చూపిస్తే ఆ తర్వాత షర్మిల ద్వారానే ఏపీలోనూ కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఉండే విధంగా చేసుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.అయితే ఈ విషయంలో షర్మిల ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఆమె నిర్ణయంపై ఇప్పుడు అంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది...

నిజంనిప్పులాంటిది

May 22 2023, 18:37

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధూ, డీకే

బెంగళూరు:

కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే చేత గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల‌ చేత అసెంబ్లీ సభ్యులుగా ప్రొటెం స్పీకర్ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం చేయించారు. ఈనెల 24వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగనున్నాయి.

దీనికి ముందు సిద్ధరామయ్య మాట్లాడుతూ, సోమ, మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశలకు నిర్ణయించామని, కొత్త అసెంబ్లీ సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి స్పీకర్‌ను ఎన్నుకుంటామని తెలిపారు.

16వ అసెంబ్లీకి ఎన్నికైన 224 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా గత శనివారంనాడు సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు.

ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్‌గా డీకే శివకుమార్, మరో 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో పూర్తి ఆధిక్యం సాధించగా, బీజేపీ 66 సీట్లు, జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకున్నాయి...

నిజంనిప్పులాంటిది

May 22 2023, 18:35

వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ రికార్డు

నూతనంగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు శిల్పకళావేదికలో నియామకపత్రాలు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం అందించారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు.

వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు, సిబ్బంది నియామకాలు భారీగా చేస్తున్నామన్నారు. 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను ఒకే ఒక రోజు నియమించడం జరిగిందని.. ఇది వైద్య విద్యలో దేశంలోనే రికార్డ్ అన్నారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్మెంట్ చేయనున్నట్టు తెలిపారు.

హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘గత నెలలో 900 మందికి పైగా ఉద్యోగాలు.. 1331 మంది ఆయుష్ పారా మెడికల్ లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పెర్మినెంట్ చేశాం. తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చాం. మరో 9222 పోస్ట్ లకు ఆరోగ్య శాఖ లో మరో రెండు నెలల్లో నియామకాలు చేపడతాం.

రోగుల ఆరోగ్యాన్ని నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. రోగులను ఆత్మీయంగా పలకరించాలి. ఒకటి రెండు ఘటనలతో ఆరోగ్య శాఖ పెరు చెడిపోకూడదు.

ప్రాణాలు కాపాడే గొప్ప వృత్తి వైద్యులది. గతంలో జబ్బులు వస్తే ఆ కుటుంబమే ఆర్ధికంగా చితికిపోయేది. ఇప్పుడు జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొన్నారు....

నిజంనిప్పులాంటిది

May 22 2023, 13:07

ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

దళిత బంధు విషయంపై మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులను కొడుకులంటూ అవమానపరిచిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తక్షణమే మాదిగలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సంఘం జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.

సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో స్థానిక జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట నిరసన ధర్నా నిర్వహించి సంఘం జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ... తుంగతుర్తిలో ప్రజలు విశ్వాసం కోల్పోయి అసహనంతో ఉన్న కిషోర్ ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను అవమాన పరుస్తున్నడని అన్నారు.

అహంకారం, బలుపు, అధికార మదం తగ్గించుకొని మాట్లాడకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

అవినీతికి అక్రమాలకు, ఇసుక దందాకు చిల్లర రాజకీయాలకు రాష్ట్రంలో కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడని అన్నారు. ప్రజా ప్రతినిధిగా హుందాగా మాట్లాడాల్సింది పోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

బిజెపి ప్రధాన కార్యదర్శి పోతపాక సాంబయ్య మాట్లాడుతూ....

తుంగతుర్తి లో అత్యధిక ఓట్లు కలిగిన మాదిగలను అవమానించిన కిషోర్ కి వచ్చే ఎన్నికల్లో మాదిగలే రాజకీయ గోరి కడతారని హెచ్చరించారు.

దళిత బంధు పథకాన్ని అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని పేర్కొన్నారు. దళిత బంధు ద్వారా దళితులకు ఇస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి గాదరి కిషోర్ ఇసుక దందాలో తీసుకున్న కమిషన్ నుండో కావని సత్యం తెలుసుకోవాలని అన్నారు. తరతరాలుగా దోపిడీకి గురైన ప్రజలకు న్యాయబద్ధంగా చెందాల్సిన వాటిని ప్రభుత్వం ఇస్తుంది తప్ప గాదరి కిషోర్ ఇంట్లో నుండి ఇస్తున్నవి కావని అన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిముల్ల శంకర్ మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి గాదరి కిషోర్ ను భారత రాష్ట్ర సమితి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వొద్దని హెచ్చరించారు.

గాదరి కిషోర్ ఎమ్మార్పీఎస్ నాయకులకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే గాదర్ కిషోర్ ను నియోజకవర్గంలో మాదిగలు అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు బొజ్జ దేవయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, కందుల మోహన్, ముత్యాల శంకర్ రెడ్డి, ఇరుగు లక్ష్మయ్య, దుబ్బ సత్యనారాయణ, మాసారం వెంకన్న, తోరకోప్పుల రాజు, బొజ్జ నాగరాజు, బొజ్జ కృష్ణయ్య, ప్రభాకర్, గురుజ వెంకన్న, కృష్ణయ్య, అర్జున్, బొజ్జ నవీన్, ఏడుకొండలు, కత్తుల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 22 2023, 12:18

ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు సీబీఐ బృందం కు లైన్ క్లియర్

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ..

ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి..

ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించలేమని తిరస్కరించిన సుప్రీం కోర్టు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 22 2023, 12:05

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్..

ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి..

వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయనున్నారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటిషన్ను మెన్షన్ చేయనున్నారు.

గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్ ను తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు.

జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ను అవినాశ్ ఉంచారు.

ఇక ఆయన పిటిషన్ను వ్యతిరేకించేందుకు వివేకా కూతురు సునీత తరుఫు లాయర్లు సైతం సిద్ధంగా ఉన్నారు..

నిజంనిప్పులాంటిది

May 22 2023, 09:45

G20 Meet: శ్రీనగర్‌లో జి 20 సదస్సు... మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులతో భారీ భద్రత

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌ జరగనున్న నేపథ్యంలో సాయుధ భద్రతను కట్టుదిట్టం చేశారు.జీ20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు..

ఉగ్రవాదులు జి20 ఈవెంట్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించవచ్చన్న నివేదికల మధ్య ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి),జమ్మూ కాశ్మీర్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

జి20 ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కదలికపై కూడా ఆంక్షలు విధించారు.లాల్ చౌక్ ఏరియాలోని దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.

జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతం కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు..

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 22 2023, 09:44

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి జిల్లా:

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు సోమవారం స్వామివారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు...

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 22 2023, 09:41

భువనగిరి ఆలేరు నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పు

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో యాదాద్రి జిల్లాలోని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో మైండ్​ గేమ్​ మొదలైంది. భూవనగిరి, ఆలేరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆలేరులో బూడిద భిక్ష్మయ్య గౌడ్​కు, భువనగిరిలో మరో నేతకు టికెట్​ఇస్తారని సోషల్​మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలతోపాటు క్యాడర్​ అయోమయానికి గురవుతోంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

మొదట్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని ఆలేరు కు మారుస్తారని, ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కాకుండా ఆమె భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందనర్​రెడ్డికి టికెట్ ఇస్తారంటూ మునుగోడు ఉప ఎన్నికకు ముందు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మహేందర్​రెడ్డి ఖండించి సునీతనే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. కానీ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్​లో చేరడంతో సీన్ మారిపోయింది.

ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు వరుసగా రెండుసార్లు గెలవడంతో వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సమఉజ్జీలు బీఆర్ఎస్​లో లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య తిరిగి బీఆర్ఎస్​లో చేరడం, అనుకున్నట్టుగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం తో ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సు నీతకు సమఉజ్జీగా నిలబడ్డారు. గౌడ సామా జికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆలేరు టికెట్ బూడిదకు ఇస్తారని ప్రచారం మొదలైంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని తప్పించి మరోపార్టీకి చెందిన బలమైన క్యాండిడేట్​ను బీఆర్ఎస్​లో తీసుకొని రావడానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా భువనగిరికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్​రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తారంటూ మరో ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్​

లీడర్ల మైండ్ గేమ్ లో భాగంగానే ఈ ప్రచారానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో కొత్త అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆలేరుకు బూడిద భిక్షమయ్య గౌడ్, భువనగిరికి చింతల వెంకటేశ్వర్ రెడ్డి లేదంటే జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అభ్యర్థులుగా పేర్కొన్న లిస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య లీడర్లే ఈ ప్రచార ప్రయోగం చేయిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితితో అటు ఎమ్మెల్యేలు.. ఇటు నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

ప్రోగ్రామ్స్​ సంఖ్య పెంచుతున్రు..

బీఆర్​ఎస్​ తరుచూ అంతర్గత సర్వేలు చేస్తుండటం, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీసుండటంతో ఇటీవల ఎమ్మెల్యేలు అటెండ్​ అయ్యే ప్రోగామ్స్​సంఖ్య పెరుగుతోంది. నియోజకవర్గాల్లో తమకు సమఉజ్జీలూ లేరని, టికెట్ కచ్చితంగా తమకే వస్తుందని భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు భావిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడే ప్రచారం జోరు పెంచారు. రెగ్యులర్​గా ప్రోగ్రామ్స్​ చేస్తూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు..